మియాపూర్‌లో కవితకు భూమి.. నిజమెంత?

Chakravarthi Kalyan
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. మరిపెడ కూడలిలో మాలోతు కవితపై చేసిన వ్యాఖ్యలను బిఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఖండించారు. తాము 2014లో టిఆర్ఎస్‌లో చేరామని, ఇంకో 20 సంవత్సరాలు వరకు కాంగ్రెస్ కోలుకోలేదని.. అందుకే బిఆర్ఎస్ లో చేరినట్లు ఆయన  వివరించారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇలాగే తమపై ఆరోపణలు చేశారని ఎమ్మెల్యే రెడ్యానాయక్ విమర్శించారు. అప్పట్లో కూడా నిరూపించాలని తాము సవాల్ విసిరినట్లు ఎమ్మెల్యే రెడ్యానాయక్ తెలిపారు.

హైదరాబాదులో సర్వేనెంబర్ 80లో ఐదు ఎకరాలు భూమిని  2005లో కొన్నామని.. అయితే ఆ తర్వాత దానిని అమ్ముకున్నట్లు ఎమ్మెల్యే రెడ్యానాయక్ వివరించారు. తనకు హైదరాబాదులో ఒక సెంటు భూమి కూడా లేదని ఎమ్మెల్యే రెడ్యానాయక్ స్పష్టంగా చేశారు. ఏదైనా మాట్లాడితే ఆధారాలు ఉండాలని ఆధారం లేకుండా మాట్లాడితే తనకు భూమి ఉన్నట్టుగా చూపించకపోతే రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని ఎమ్మెల్యే రెడ్యానాయక్ సవాల్ విసిరారు. తనకు భూమి ఉన్నట్లు చూపనట్లయితే రాజకీయ సన్యాసం తీసుకుంటారని ఎమ్మెల్యే రెడ్యానాయక్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: