ఈనెల 28, 29 తేదీల్లో పీఓడబ్ల్యూ మహాసభలు?

Chakravarthi Kalyan
ప్రగతిశీల మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు జనవరి 28,29వ తేదీలలో జరుగుతాయి. మహబూబాబాద్ పట్టణంలోని గంగ పుత్ర భవనంలో నిర్వహిస్తామని అధ్యక్షురాలు సంధ్య తెలిపారు. పీవోడబ్ల్యూ గత నాలుగు దశాబ్దాలకు పైగా స్త్రీ, పురుష సమానత్వాన్ని, అన్ని రంగాలలో సమ భాగస్వామ్యాన్ని కోరుతున్నదని సంధ్య తెలిపారు. స్త్రీలపై సాగుతున్న పితృస్వామిక అణచివేతను, శ్రమ దోపిడీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... స్త్రీల హక్కుల పరిరక్షణ కోసం, సమస్యల పరిష్కారం కోసం, కుల, వర్గ, మత, జాతి వివక్షలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతున్నదని సంధ్య తెలిపారు.

మహిళా ఉద్యమాలతో పాటు సమాజంలో సాగుతున్న అనేక సమూహాల పోరాటాలలో భాగస్వామ్యం తీసుకుంటున్నదని సంధ్య అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించి... పోడు భూముల పోరాటాలకు మద్దతు తెలిపి అదివాసీలకు గొంతుకనిచ్చిందని సంధ్య పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బలమైన మహిళా సంఘంగా గుర్తింపు పొందిన పీవోడబ్ల్యూ తన నిర్మాణ మహాసభలను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరుపుకుంటున్నదని సంధ్య తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

pow

సంబంధిత వార్తలు: