వివాదం: కల్లుకు వేదామృతమని పేరు పెడతారా?
ఈ వాగ్వాదంతో అక్కడ కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వేదం అనే పదాన్ని తీసివేయలని బ్రాహ్మణ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. స్వచ్ఛమైన ప్రకృతి పానీయం నీరాకు వేదామృతం పేరు పెడితే వేదాలను కించపరిచినట్లు ఎలా అవుతుందని గౌడ సంఘాలు ప్రశ్నించాయి. పురాణలలో సురులు సేవించిన పానీయాన్నీ సురాపాకం అన్నారని గౌడలు గుర్తు చేస్తున్నారు. వేదాలను రాసింది కూడా తాటి కమ్మల మీదనే అని బ్రాహ్మణులు గ్రహించాలంటున్నారు.