కందుకూరులో 8 మంది మృతి.. పవన్‌ రియాక్షన్‌?

Chakravarthi Kalyan
నిన్న కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి 8 మంది కార్యకర్తలు మృతి చెందిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనపై జనసేస అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కందుకూరు ప్రమాదం దురదృష్టకరమని జనసేస అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరులో తెలుగుదేశం పార్టీ సభ జరుగుతుండగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందడం, మరి కొందరు ఆసుపత్రి పాలవడం చాలా దురదృష్టకరమని జనసేస అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

 ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను అన్న జనసేస అధినేత పవన్ కల్యాణ్.. అటువంటి కార్యకర్తలు ఇలా ప్రమాదం బారినపడి మృతి చెందడం ఎంతో విచారకరమన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని జనసేస అధినేత పవన్ కల్యాణ్ ప్రార్థిస్తున్నామన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేసిన జనసేస అధినేత పవన్ కల్యాణ్.. ఆసుపత్రి పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: