ఎన్టీఆర్ రమ్మన్నారు.. కానీ నేనే రాలేదు?

Chakravarthi Kalyan
గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుగలు ఘనంగా జరిగాయి. సీనియర్ నటులు మురళిమోహన్, నటి జయచిత్రకు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార అందజేశారు. ఎన్టీఆరు కుమార్తె గారపాటి లోకేశ్వరి, కుమారుడు నందమూరి రామకృష్ణ చేతుల మీదుగా అవార్డు ప్రధానం జరిగింది. మురళిమోహన్ ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లోకి తనను ఎన్టీఆర్ ఆహ్వానించారని... అప్పటి పరిస్థితుల్లో కేవలం ప్రచారానికే పరిమితమైనట్లు తెలిపారు.
నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచిన సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు తీవ్రంగా శ్రమించారని మురళిమోహన్ అన్నారు. ఎన్టీఆర్ నేర్పించిన క్రమశిక్షణ, విలువలు, నైతికతను ఆయన కుటుంబ సభ్యులు కొనసాగిస్తున్నారని మురళిమోహన్ అభినందించారు. అవార్డు అందుకున్న నటి జయచిత్ర ఎన్టీఆర్ తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. తన తల్లి కూడా ఎన్టీఆర్ తో నటించిన విషయాల్ని గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: