బీసీ పాలిటిక్స్: వైసీపీ, టీడీపీ దొందూదొందే?

Chakravarthi Kalyan
బీసీల ఓట్ల కోసం వైసీపీ, టీడీపీకపట నాటకాలు ఆడుతున్నాయని.. మొసలి కన్నీరు కారుస్తున్నాయనీ కాంగ్రెస్‌ నేత తులసి రెడ్డి విమర్శించారు. బీసీల నిజమైన నేస్తం కాంగ్రెస్ ఒక్కటేనని కాంగ్రెస్‌ నేత తులసి రెడ్డి అన్నారు. టిడిపి, వైసీపీ పుట్టకముందే 1970 లోనే కాంగ్రెస్ పార్టీ బీసీలకు విద్యా, ఉద్యోగాలలో 25 శాతం రిజర్వేషన్లు కల్పించిందని కాంగ్రెస్‌ నేత తులసి రెడ్డి చెప్పారు. వైసీపీ పుట్టకముందే 1993 లోనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిందని కాంగ్రెస్‌ నేత తులసి రెడ్డి అన్నారు.

వైసీపీ పుట్టకముందే 2008 లోనే కాంగ్రెస్ పార్టీ బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాలను ప్రవేశపెట్టిందని కాంగ్రెస్‌ నేత తులసి రెడ్డి  అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీసీలకు ముఖ్యమంత్రి పదవి లేక వైసీపీ అధ్యక్ష పదవుల్లో ఒక దానిని ప్రకటించాలని కాంగ్రెస్‌ నేత తులసి రెడ్డి  డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: