అయ్యప్ప మాల వేసుకున్నారని.. ఇంత దారుణమా?
అందుకు కారణం ఏంటో తెలుసా.. ఆ గ్రామంలో పలువురు అయ్యప్ప దీక్షలో ఉన్నారట. మృతదేహం ఊళ్లోకి వస్తే.. వారు మైలపడిపోతారట. అందుకే ఊరి వెలుపలే మృతదేహాం ఉంచుకోవాలని సూచించడం వివాదానికి దారి తీసింది. అంబులెన్స్ ను గ్రామస్తులు రోడ్డుపై నే అడ్డుకోవడంతో మృతుని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తి చనిపోయి గ్రామానికి వస్తే అడ్డుకోవడం దారుణమని కనీసం మానవత్వం లేదా అని వాగ్వివాదానికి దిగారు. పోలీసులు వచ్చి సర్ది చెప్పారు.