మోదీ వచ్చిన వేళ.. ఏపీకి బంపర్ గిఫ్ట్?

Chakravarthi Kalyan
విశాఖలో ప్రధాని మోదీ పర్యటిస్తున్న వేళ.. ఏపీకి కేంద్రం ఓ బంపర్ గిఫ్ట్ అందించింది. విశాఖలో  దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి 106 కోట్లతో రైల్వే బోర్డు అనుమతి ఇచ్చింది. నిన్న రాత్రి దీనికి సంబంధించిన ఆదేశాలు వచ్చాయి. ఈ జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణ ప్రతి పాదిత స్థలం వైర్లెస్ కాలనీని నిన్న రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ సందర్శించారు.

నిన్నరాత్రి బాగా పొద్దు పోయిన తర్వాత తూర్పు కోస్తా రైల్వే జీఎం రూప్ నారాయణ.. దక్షిణ కోస్తా జోన్ ప్రత్యేక అధికారి సహా ఉన్నతాధికారులతో ఆ ప్రాంతాన్ని రైల్వే మంత్రి సందర్శించారు. కొన్నాళ్లుగా అసలు ఈ విశాఖ జోన్ ఉందా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ ప్రకటన  రావడం నిజంగా ఏపీకి గిఫ్ట్ అనుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: