ఆ వర్శిటీ రోడ్డు సంగతేంటి సార్.. లోకేశ్ లేఖ?
రాష్ట్రంలో గత 3ఏళ్లుగా రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని నారా లోకేష్ ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతమైన అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీకి వెళ్లే రహదారుల దారుణమైన పరిస్థితి గురించి ప్రత్యేకంగా తమ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానన్నారు. 2017లో స్థాపించిన యూనివర్సిటీకి వెళ్లే రోడ్ల దయనీయ స్థితి ఆవేదన కలిగిస్తోందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు రహదారుల దుస్థితిపై తనకు అనేక ఫిర్యాదులు అందచేశారు. ఆ మార్గంలో రవాణా పెను సవాలుగా మారిందని వారంతా ఆందోళన చెందుతున్నారన్నారు. తరచూ ప్రమాదాలు, వాహనాలు దెబ్బతినడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించారు.