కాకినాడ జిల్లాకు గుడ్‌ న్యూస్.. ?

Chakravarthi Kalyan
కాకినాడ జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు లైఫిజ్‌ ఫార్మా సంస్థ ముందుకొచ్చింది.  కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో లైఫిజ్‌ ఫార్మా సంస్థ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇక్కడ మొత్తంగా రూ.1900 కోట్లు లైఫిజ్‌ ఫార్మా పెట్టుబడి పెట్టనుంది. ఈ కంపెనీ ద్వారా  2వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయి.  ఏప్రిల్‌ 2024నాటికి కంపెనీ ఏర్పాటు పూర్తి చేయాలని లైఫిజ్‌ ఫార్మా లక్ష్యంగా పెట్టుకుంది.
ఏపీఐ డ్రగ్‌ తయారీలో చైనా దిగుమతులపై ఆధారపడకుండా.. స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేసే ప్రణాళికలో భాగంగా ఈ కంపెనీ ఏర్పాటు కానుంది. ఈ పరిశ్రమ కోసం ఇప్పటికే లైఫిజ్‌ ఫార్మా సంస్థ 236.37 ఎకరాలను సేకరించింది. తాజాగా ఈ పెట్టుబడులను రాష్ట్ర పెట్టుబడుల బోర్డు అంగీకరించింది. దీంతో పాటు మొత్తం ఆరు గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.  ఈ ఆరు ప్రాజెక్టులకోసం రూ.81,043 కోట్ల పెట్టుబడి రాబోతోంది. మొత్తం  20,130 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: