ఏపీకి గుడ్ న్యూస్.. ఇక చందనం అమ్ముకోవచ్చు?
అయితే.. ఇప్పుడు ఏపీకి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఎర్ర చందనం అమ్మకానికి కావలసిన అన్ని అనుమతులు ఇప్పుడు ఏపీకి వచ్చాయట. అందుకే త్వరలో 2 వేల 640 మెట్రిక్ టన్నుల విక్రయానికి ఏపీ ఫారెస్టు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. ఈ విషయాన్ని వారు సీఎంకు తాజాగా సమీక్షలో తెలిపారు. ఎర్రచందనం విక్రయంలో అత్యంత పారదర్శక విధానాలు పాటించాలని సీఎం జగన్ వారికి సూచించారు. గ్రేడింగ్లో థర్డ్ పార్టీ చేత కూడా పరిశీలన చేయించాలని కూడా సీఎం జగన్ ఆదేశించారు.