ఈటల రాజేందర్ ఇంట్లో తీవ్ర విషాదం?
ఈటల మల్లయ్య కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన్ను హైదారాబాద్లోని ఆర్వీఎం ఆసుపత్రి-మెడికల్ కళాశాలలో చేర్పించారు. అక్కడే చికిత్స అందిస్తూ వస్తున్నారు. నిన్న రాత్రి ఈటల మల్లయ్య ఆరోగ్యం పూర్తిగా విషమించింది. మంగళవారం రాత్రి ఈటల మల్లయ్య కన్నుమూశారు. ఈటల మల్లయ్య మరణ వార్తను ఈటల కుటుంబీకులు కూడా ధ్రువీకరించారు. ఈటల మల్లయ్య పార్థివ దేహాన్ని హనుమకొండ జిల్లా కమలాపూర్ లోని స్వగృహంలో కొద్దిసేపు ఉంచుతారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని ఈటల కుటుంబం తెలిపింది.