నడిరోడ్డుపై భార్యను నగ్నంగా నిలబెట్టి స్నానం?

Chakravarthi Kalyan
ఆధునిక యుగంలోనూ మూఢ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. దీనికి తోడు డబ్బు ఆశ కూడా తోడైతే.. జరిగే అనర్థాలకు అంతే ఉండదు.. ఇప్పుడు మహారాష్ట్రలోని పుణెలో జరిగిన సభ్య సమాజం తలదించుకునే ఘోర సంఘటన అందుకు మరో ఉదాహరణ. డబ్బు మీద ఆశతో  కట్టుకున్న భార్యను అందరి ముందు నగ్నంగా నిలబెట్టాడు. కట్టుకున్న భార్యను అందరి ముందు నగ్నంగా స్నానం చేయిస్తే నీకు ధన యోగం పడుతుందని ఓ జ్యోతిష్యుడు చెప్పడంతో ఓ బుద్ధి లేని భర్త అదే పని చేశాడు.

వ్యాపారంలో లాభాలు రావాలని... సుఖశాంతులు నెలకొనాలని.. ఇలాంటి క్షుద్రపూజ చేయించాడా భర్త. మరో దారుణం ఏంటంటే.. ఈ అరాచకానికి ఆ మూర్ఖ భర్త తల్లిదండ్రులు కూడా సహకరించారు. భర్త ఒత్తిడితో ఆ భార్య సిగ్గుతో చచ్చిపోయింది. అందరి ముందు నగ్నంగా స్నానం చేసింది. చుట్టూ ఉన్నవారు ఆ దారుణాన్ని కళ్లప్పగించి చూశారు. ఆ దారుణం తర్వాత బాధితురాలు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్తను, తల్లిదండ్రులను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: