దేవుడా.. బాసర ఐఐటీలో గంజాయి కలకలం?
బాసర ఐఐఐటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు శుక్రవారం రాత్రి గంజాయి తాగుతున్నారని మిగిలిన విద్యార్థులు చెబుతున్నారు. ఆ విషయం పసిగట్టి వెంటనే వారు బాసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాసర ఐఐఐటీకి వచ్చి తనిఖీలు చేసి.. ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు విద్యార్థులపై ఎన్డీపీసీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. తర్వాత రిమాండ్కు తరలించారు. విద్యాలయంలోకి గంజాయి ఎలా వచ్చింది.. ఇంకా ఎందరు గంజాయి తాగుతున్నారన్న కోణంలో విచారణ సాగుతోంది.