అయ్యో.. కోనసీమ లంకలు?
కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం బూరుగులంక, ఊడిమూడిలంక, అరిగెలవారిపేట, పెదపూడిలంక వంటి లంకలు పూర్తిగా జల దిగ్భందం అయ్యాయి. ఈ గ్రామాల్లో పడవలపైనే ప్రయాణం చేయాల్సి వస్తోంది. అలాగే... పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని ఆచంట, యలమంచిలి
మండలాల పరిధిలోని పెదమల్లంలంక, అయోధ్య లంక, ఆనగారి లంక, కననకాయ లంకలకు కూడా గోదావరి ఉగ్రరూపం కారణంగా రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ గోదావరి వరద తగ్గేంత వరకూ ఈ లంక గ్రామాల ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతకాల్సిందే.