నిజామాబాద్లో ఇన్నిఅరాచకాలు జరుగుతున్నాయా?
ఉగ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువయ్యాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ శాంతిభద్రతల పరిరక్షణలో వైఫల్యం చెందారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నిజామాబాద్ లో ప్రజాప్రతినిదులను హత్య చేసేందుకు సుపారీలు తీసుకుంటున్నారని.. ఎంపీగా ఉన్న నాపైనా హత్యా యత్నం జరిగిందని ధర్మపరి అర్వింద్ గుర్తు చేస్తున్నారు. ఈ విషయంపై స్వయంగా నేను ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సహకారంతోనే వందలాది నకిలీ పాస్ పోర్టులతో రోహింగ్యాలు చలామణి అవుతున్నారని ఘాటుగా విమర్శించారు ధర్మపురి అర్వింద్.