ఆ వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్?
వారిలో అతి తక్కువగా క్షేత్ర స్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యేలు, నేతలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అసలు ఒక్క రోజూ తిరగలేదని సీఎం జగన్ తెలిపారు. నెలరోజు కార్యక్రమంలో ఒక్కరోజూ తిరగని వారి లిస్టు జగన్ బయటపెట్టారు. వారిలో కొవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి వంటి వారు ఉన్నారు.