అయ్యయ్యో.. మేడారం జాతరకెళ్తూ.. నలుగురు మృతి..?

Chakravarthi Kalyan
మేడారం జాతర చివరి రోజు అపశ్రుతి చోటు చేసుకుంది. మేడారం జాతరకు వెళ్తూ ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు  ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఓ ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. గట్టయ్య ఆలయం సమీపంలో ఈ దారుణం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇవాళ మేడారం జాతర చివరి రోజు కావడంతో రద్దీ చాలా ఎక్కువగా ఉంది. నాలుగు రోజులుగా వైభవంగా జరుగుతున్న జాతర ఇవాళ చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ సమ్మక్క, సారమ్మలు వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. జాతర చివరి రోజు  ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరగడం భక్తులను కలచివేసింది. ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులు సమాచారం సేకరిస్తున్నారు. మృతి చెందిన వారి వివరాలు సేకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: