అయ్యయ్యో.. మేడారం జాతరకెళ్తూ.. నలుగురు మృతి..?
ఈ ప్రమాదంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇవాళ మేడారం జాతర చివరి రోజు కావడంతో రద్దీ చాలా ఎక్కువగా ఉంది. నాలుగు రోజులుగా వైభవంగా జరుగుతున్న జాతర ఇవాళ చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ సమ్మక్క, సారమ్మలు వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. జాతర చివరి రోజు ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరగడం భక్తులను కలచివేసింది. ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులు సమాచారం సేకరిస్తున్నారు. మృతి చెందిన వారి వివరాలు సేకరిస్తున్నారు.