పెన్సిల్ పోయిందని పోలీస్ స్టేషన్లో విద్యార్థుల ఫిర్యాదు
తాజాగా తమ పెన్సిల్ పోయిందని కొంత మంది చిన్నారులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా పెదకడుబూరులో చోటు చేసుకున్నది. తన పెన్సిల్ను తోటి విద్యార్థి దొంగతనం చేసాడని హన్మంత్ అనే బాలుడు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లాడు. తన పెన్సిల్ను దొంగిలించిన వారిపై పోలీస్ కేసు పెట్టాలని పోలీసులను కోరాడు. దీనిపై స్పందించిన పోలీసులు అతనికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. పెన్సిల్ పోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన పలువురు జోక్ అని నవ్వుకుంటున్నారు.