హైదరాబాద్ : గ్లోబల్ ఆస్పత్రిలో 70 శాతం షేర్ అమ్మకం లో భార్యభర్తల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.ఈ వివాదంపైనే ఆసుపత్రి సీఎండీ డాక్టర్ రవీంధ్రనాథ్ ఈ నెల 2న తన భార్య ఆదిలక్ష్మీని చితకబాదాడు.దీంతో ఆమె జూభ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రవీంథ్రనాథ్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేశారు.అయితే రవీంధ్రనాథ్ తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని హైకోర్ట్ని ఆశ్రయించారు.ఈ పిటిషన్ని విచారించిన హైకోర్టు నెల 11 వరకు రవీంధ్రనాథ్ని అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలిచ్చింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని డాక్టర్ రవీంధ్రనాథ్కు ను హైకోర్టు ఆదేశించింది.