జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడితే వారికి భారత్ లో ఉండే హక్కు లేదు: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

KISHORE
పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. తాజాగా నేషనల్ కాన్ఫరెన్సు అధినేత ఫరూక్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రద్దు చేసిన ఆర్టికల్ 370 సెక్షన్ ను మళ్లీ రాజ్యాంగంలో చేర్చాలని ని ఫరూక్ అబ్దుల్లా, మెహబూబాలు డిమాండ్ చేయడంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు భారతదేశంలో ఉండే హక్కు లేదని జోషి వ్యాఖ్యానించారు. చైనా దేశం మనపై దాడి చేస్తున్న సమయంలో ఆ దేశ సహాయంతో ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని చెప్పడం హాస్యాస్పదం అని ఆయన వ్యాఖ్యానించారు. దాదాపుగా14 నెలల నిర్బంధంలో నుంచి విడుదలైన తర్వాత ఇటీవల తన మొదటి విలేకరుల సమావేశంలో మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ జెండాను ఎగురవేయడానికి అనుమతించకపోతే, తమ పార్టీ భారత త్రివర్ణ పతకాన్ని కూడా ఎగురవేయదని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో ఆమె అన్న మాటలు యావత్ భారతదేశం అంతా పెను దుమారం రేపాయి.
 గత ఏడాది ఆగస్టు 5 న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ను రద్దు చేయడానికి ముందు, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం ఉన్నాయి. ఆర్టికల్ -370 ను రద్దు చేయడం గురించి పీడీపీ అధ్యక్షుడు మెహబూబా ముఫ్తీ ఇటీవల చేసిన ప్రకటనపై గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రికి భారతదేశం,దేశ చట్టాలు నచ్చకపోతే, ముఫ్తీ కుటుంబం పాకిస్తాన్ దేశానికి వెళ్లాలని పటేల్ సూచించారు. అయితే మోడీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి తొలగించే పూర్తిగా జమ్మూ కాశ్మీర్ భారత్ కే సొంతం అని రాజ్యాంగంలో చేర్చాయి. అప్పటి నుండి జమ్మూ కాశ్మీర్లో కూడా మువ్వన్నెల జెండా ఎగురుతుంది. వారికి కూడా భారత పౌరసత్వం సంపూర్ణమయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: