మచ్చలు తగ్గి ముఖాన్ని వైట్ అండ్ బ్రైట్ గా మార్చే పౌడర్!

Purushottham Vinay
ఇక ఎలాంటి మచ్చలు లేకుండా ముఖం చాలా వైట్‌గా ఇంకా అలాగే బ్రైట్‌గా మెరిసిపోవాలని అందరూ కూడా కోరుకుంటారు. కానీ, అందుకు విరుద్ధంగా ఏదో ఒక చర్మ సమస్య అనేది చాలా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.ఇక ఏదో ఒక కారణం చేత ముఖంపై మచ్చలు పడి చాలా కాంతిహీనంగా కూడా మారుతుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే పౌడర్‌ను వాడితే గనుక ఎలాంటి మచ్చలు ఉన్నా వెంటనే తగ్గిపోయి చర్మం వైడ్ అండ్ బ్రైట్‌గా మారడం ఖాయం. మరి ఆలస్యం చేయడం ఎందుకు ఆ పౌడర్ ఏంటో ఇంకా ఎలా తయారు చేసుకోవాలో.. తెలుసుకుందాం. ముందుగా ఒక క్యారెట్ ఇంకా కీరాలను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి. ఈ తురుము నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకోని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో క్యారెట్‌ ఇంకా కీరా జ్యూస్ వేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగిన క్యారెట్‌ ఇంకా కీరా జ్యూస్‌ను చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక అందులో ఒక కప్పు బియ్యం పిండిని దానిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలపాలి.


ఆ తర్వాత ఈ పిండిని గంట పాటు ఎండలో బాగా ఎండబెట్టుకుని.. అప్పుడు మిక్సీ జార్‌లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందువల్ల క్యారెట్‌-కీరా పౌడర్ సిద్ధం అవుతుంది. ఇక ఈ పౌడర్‌ను ఎలా స్కిన్‌కి అప్లై చెయ్యాలి అన్నది చూద్దాం.ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్‌-కీరా పౌడర్‌ ఇంకా వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, రెండు టేబుల్ స్పూన్ల టమాటో జ్యూస్‌ ఇంకా రెండు చుక్కలు విటమిన్ ఇ ఆయిల్, చిటికెడు పసుపు ఇంకా వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్ వేసుకుని అన్నీ కలిసే దాకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి ఇంకా మెడకు పట్టించి ఇరవై నిమిషాల తరువాత వాటర్‌తో బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేశాక పన్నెండు గంటల వరకు మీరు సోప్ వాడరాదు. ఇలా రోజుకు ఒకసారి చేస్తే మచ్చలు తగ్గి చర్మం వెంటనే వైట్ అండ్ బ్రైట్‌గా తయారు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: