కారు కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్..!
పండుగ సీజన్ వచ్చిందంటే ఆఫర్లే ఆఫర్లు. మాములు సమయంలో 20 వేలు ఉండే వస్తువు కూడా పండుగా సీజన్ లో 10 వేలకి వచ్చేస్తుంది. సరిగ్గా ఇదే తరహాలో ఇయర్ ఎండ్ సేల్లో భాగంగా కొత్తగా కారు కొనాలనుకునే వారికీ శుభవార్త చెప్పింది. ఆ శుభవార్త వింటే వావ్ అంటారు.. అంతమంచి ఆఫర్ ఇచ్చారు.
ఇంకా అసలు విషయానికి వస్తే.. ముంబైలో కొత్తకారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నా వారికీ కార్ల తయరీ కంపెనీలు వివిధ రకాల డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కారు కొనుగోలుపై కనీసం 50 వేల రూపాయిలు డిస్కౌంట్ వచ్చేలా డిస్కౌంట్లు ప్రకటించారు.
మారుతీ సుజుకీ, హ్యుండాయ్, టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు అదిరిపోయే తగ్గింపు ఆఫర్లను పాటిస్తున్నాయి. రూ.5 లక్షల లోపు ధర ఉన్న ఎంట్రీ లెవెల్ విభాగంలో టాటా టియాగో కారుపై 85 వేల రూపాయిలు వరకు, మారుతీ ఆల్టో కారుపై 60 వేల రూపాయిలు వరకు, డాట్సన్ రెడిగో కారుపై 59 వేల రూపాయిల వరకు, రెనో క్విడ్పై రూ.57 వేల రూపాయిల వరకు, హ్యుండాయ్ శాంట్రో కారుపై రూ.55 వేల రూపాయిల వరకు ఆఫర్స్ అందిస్తున్నారు.
రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు ధర ఉన్న కార్ల విషయానికి వస్తే.. హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 కారుపై రూ.75 వేల వరకు తగ్గింపు ఉంది. మహీంద్రా కేయూవీ 100 ఎన్ఎక్స్టీ కారుపై రూ.71,000 వరకు, మారుతీ స్విఫ్ట్ మోడల్పై రూ.70 వేల వరకు, మారుతీ ఇగ్నిస్ మోడల్పై రూ.65 వేల వరకు ఆఫర్లు ఇచ్చారు.
కారు కొనాలి అనుకునే వారికీ ఇది సరైన సమయం. ఎందుకంటే ఇన్ని ఆఫర్లు మళ్ళి మళ్ళి రావు. ఇయర్ ఎండ్ సేల్ కనుక ఆఫర్లు ఒకదానికి మరొకటి ఇలా వస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే కొత్త కార్లను కోనండీ.. ఆఫర్లను పొంది డబ్బుని అదా చేసుకోండి.