బాలీవుడ్ లో పూజా హెగ్డే పాగా వెసిన‌ట్టేనా ?

Dabbeda Mohan Babu
హీరోయిన్ పూజా హెగ్డే అంటే తెలియ‌ని సినిమా అభిమానులు ప్ర‌స్తుతం ఎవ‌రు లేక పోవచ్చు. అంత‌గా పాపుల‌ర్ అయిన హీరోయిన్ పూజా హెగ్డే. ఒక తెలుగు భాష లోనే కాకుండా హింది, త‌మిళ భాష‌ల‌లో స్టార్ హీరోల‌తో సినిమా లు తీస్తూ బిజీ గా ఉంటుంది. అంతే కాకుండా ఈ మూడు సినిమా ఇండ‌స్ట్రీ లలో ఎక్కువ క్రేజీ ఉన్న హీరోయిన్ కూడా పూజా హెగ్డే నే. అయితే మొద‌ట తెలుగు లోనే ఎక్కువ సినిమా తీసే ఈ బుట్ట బోమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా రాణిస్తుంది. అమె మొద‌ట త‌మిళ భాష లో 2012 లో జీవా హీరో గా వ‌చ్చిన ముగ‌మూడి అనే సినిమా లో మొద‌టి సారి న‌టించింది. తర్వాత తెలుగు లో ఒక లైలా కోసం అనే సినిమా లో నటించింది. ఈ సినిమా లో హీరో హీరోయిన్ లుగా నాగ చైత‌న్య పూజా హెగ్డే న‌టించారు. అయితే ఇదే సంవ‌త్స‌రం లో నే బాలీవుడ్ లో అడుగు పెట్టింది . బాలీవుడ్ లో త‌న మొద‌టి సినిమా ను స్టార్ హీరో హృతిక్ రోష‌న్ తో క‌లిసి న‌టించింది. మొహెంజో దారో అనే అనే సినిమా లో న‌టించింది. ఈ సినిమా 2016 లో విడుద‌ల అయిన పెద్ద గా రాణించ‌లేదు.

కానీ టాలీవుడ్ లో వ‌రుస గా అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంది. దువ్వాడ జ‌గన్నాథం, అలా వైకుంఠ పూరం, అర‌వింద స‌మేత వీర రాఘ‌వ వంటి సినిమా లు చేసి చాలా క్రేజ్ సంపాదించు కుంది. వీటితో పాటు సాక్ష్యం, గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్, మ‌హ‌ర్షి వంటి సిన‌మా ల్లో కూడా మంచి గుర్తింపు వ‌చ్చింది.  అలాగే రంగ‌స్థ‌లం  సినిమా లో జిగేలు రాణి  అనే పాట‌లో క‌నిపించి తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. పూజా హెగ్డే చేస్తున్న సినిమాలు వరుస‌గా  హిట్ అవ‌డం తో బాలీవుడ్ నిర్మాతుల పూజా హెగ్డే ను త‌మ సినిమాల్లో అవ‌కాశాలు ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు. దీంతో 2020 లో స‌ల్మాన్ ఖాన్ తో క‌లిసి క‌భీ ఈద్ క‌భీ దీపావ‌ళి అనే సినిమా లో నటించింది. అలాగే ఈ మ‌ధ్య కాలంలో నే ర‌ణ‌వీర్ సింగ్ తో సిర్క‌స్ లో న‌టించింది. అలాగే ప్ర‌స్తుతం కూడా బాలీవుడ్ వ‌రుస గా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. దీంతో పూజా హెగ్డే కూడా ముంబాయ్ లో నే ఎక్కువ ఉంటుంది. దీంతో బాలీవుడ్ లోనే స్థిర ప‌డుతుందా అని పూజా హెగ్డే తెలుగు అభిమానులు ఆందోళ‌న ప‌డుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: