అమ్మ: గర్భిణులకు డయాబెటిస్ వస్తే ఏం జరుగుతుంది..??

N.ANJI
ప్రతి మహిళ బిడ్డకు జన్మనివ్వాలని చాలా కలలు కంటుంటారు. మహిళా గర్భం దాల్చిన నుండి ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. గర్భిణులు ఆహార విషయంలో కానీ, చేసే పనులలో ఆచితూచి అడుగులు వేస్తారు. అయితే గర్భిణులు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుని కచ్చితంగా ఆ డైట్‌ను ఫాలో అవుతూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.
అంతేకాదు.. ప్రెగ్నెసీ సమయంలో కొందరిలో వాంతులు, వికారం వంటి సమస్యలు ఎక్కువగా బాధపెడుతుంటాయి. అలాంటి వారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నా వారి శరీరానికి పడవు అనే చెప్పాలి మరి. ఆ సమస్యతో గర్భిణులలో శిశువు పెరుగుదల లోపం వస్తుందని చెబుతున్నారు. ఇక మరికొందరిలో గర్భం ధరించినప్పుడు వారు మధుమేహానికి గురవుతూ ఉంటారు. దానినే జెస్టేషనల్‌ డయాబెటిస్ అని కూడా అంటారు.
అయితే గర్భిణీ స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు అవుతుండటం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ డయాబెటిస్‌ను నియంత్రించడానికి సమతుల్య ఆహారం తీసుకోవటం ద్వారా నియంత్రించవచ్చునని అంటున్నారు. గర్భిణులు పిండి పదార్థాలు తక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకొని ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ గల ఆహార పదార్థాలను తీసుకోవాలి. అన్నం తక్కువగా తిని, కూరలు అధిక మోతాదులో తీసుకోవాలని చెబుతున్నారు.
ఇక గర్భిణులు ఆహారం తీసుకునేటప్పుడు ఎక్కువ మొత్తంలో ఒకేసారి తినకుండా కొద్ది మోతాదులో ఎక్కువ సార్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటున్నారు. అంతేకాదు.. ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా లభించే పదార్థాలను తీసుకోవాలని అంటున్నారు. అలాగే డయాబెటిస్‌తో బాధపడేవారు వారి ఆహారంలో కొద్దిరోజుల పాటు చక్కెర, స్వీట్లు మొదలైన తీపి పదార్థాలను మానేయడం ఎంతో మంచిదని అంటున్నారు.
కాగా.. డయాబెటిస్‌తో బాధపడే వారు ఎప్పుడూ రక్తంలోని చక్కెర స్థాయిలను గమనించుకుంటూ డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని చెబుతున్నారు. గర్భిణులు రాత్రి పడుకునే ముందు మజ్జిగ తాగడం ద్వారా అజీర్తి సమస్యలు తొలగిపోతాయని అన్నారు. అంతేకాక.. వారు ప్రతిరోజు సాయంత్రం ఒక అరగంట పాటు నడవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: