రొయ్యల కర్రీ చేసుకుంటారు.. లేదా రొయ్యల వేపుడు చేసుకోవచ్చును. బిరియాని కూడా ఈ మధ్య ఎక్కువగా చేసుకుంటున్నారు. అయితే ఈ రొయ్యలతో మంచూరియ వెరైటీగా చేసుకోవడం ఎలానో ఇప్పుడు చూద్దాం.. రొయ్యల కర్రీ చేసుకుంటారు.. లేదా రొయ్యల వేపుడు చేసుకోవచ్చును. బిరియాని కూడా ఈ మధ్య ఎక్కువగా చేసుకుంటున్నారు. అయితే ఈ రొయ్యలతో మంచూరియ వెరైటీగా చేసుకోవడం ఎలానో ఇప్పుడు చూద్దాం.. ఏవి ముఖ్యంగా వాడితే టెస్ట్ ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
రొయ్యలా మంచూరియాకు కావలసిన పదార్థాలు :
పచ్చిరొయ్యలు - 300 గ్రా.,
ఉల్లితరుగు - 1 కప్పు,
మైదా - 1 టేబుల్ స్పూను,
కార్న్ఫ్లోర్ - 4 టేబుల్ స్పూన్లు,
అల్లం, వెలుల్లి తరుగు - 1 టీ స్పూను చొప్పున,
వెల్లుల్లి పేస్టు - 2 టీ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత,
అజినమోటో - చిటికెడు,
వెనిగర్ - 2 టేబుల్ స్పూన్ల చొప్పున,
మిరియాల పొడి - అర టీ స్పూను,
టమోటా, చిల్లీ, సోయా సాస్లు,
క్యాప్సికం - 1, నూనె - వేగించడానికి సరిపడా.
ఉల్లికాడల తరుగు - 2 టేబుల్ స్పూన్లు..
తయారీవిధానం :
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రొయ్యలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలి.. అందులో మైదా,టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, టేబుల్ స్పూను అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు, టేబుల్ స్పూను సోయా సాస్, ఉప్పులతో కలిపి దాదాపు గంటసేపు పక్కనుంచి, ఆ తర్వాత నూనెలో దోరగా వేగించాలి. కొద్ది నూనెలో వెల్లుల్లి, ఉల్లి తరుగు, ఉల్లి కాడలు, క్యాప్సికం తరుగు, అజినమోటో, వెనిగర్, ఉప్పు వేసి 2 నిమిషాలు వేగించాలి. రొయ్యలు, సోయా సాస్, చిల్లీ సాస్, టమోటా సాస్ కూడా వేసి కరిగించిన కార్న్ఫ్లోర్ చల్లాలి. చివర్లో మిరియాల పొడి చల్లుకొని పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైఅన్ రొయ్యల మంచూరియ రెడీ..