విజయం మీదే: ఎంత కష్టపడినా లక్ష్యాన్ని అందుకోలేకున్నారా?
అయితే హనుమాన్ జయంతి రోజున చేసే శని పూజకు ప్రత్యేకమైన ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. శని దోషాన్ని పోగొట్టుకోవడం కోసం ఏం చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
హనుమాన్ జయంతి రోజున... అనగా శనివారం సంధ్యా సమయంలో ఆ హనుమంతుని ఆలయానికి వెళ్లి దీపారాధన చేయాలి. అది కూడా దీపారాధనకు ఆవ నూనెను మాత్రమే వినియోగించాలి. దీపారాధన తర్వాత 11 సార్లు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా ఆ ఆంజనేయుని అనుగ్రహంతో శని ప్రభావం తగ్గుతుంది. అదే విధంగా గులాబీ పువ్వులతో కూడిన పూల మాలను మరియు తమలపాకుతో కూడిన మాలను హనుమంతునికి సమర్పించాలి. ఇలా చేయడం వలన శని గ్రహ ప్రభావం నుండి విముక్తి దొరుకుతుందని పండితులు చెబుతున్నారు.
అలాగే హనుమంతుని అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉంటుంది. పైన చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే అనుకున్నవి అన్నీ నెరవేరుతాయి.