రీల్స్ చేస్తూ లోకాన్ని మర్చిపోయింది.. చివరికి?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు కూడా బ్రతికేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సోషల్ మీడియా ద్వారా ప్రపంచ నలుమూలల్లో జరిగిన విషయాలను అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ లో తెలుసుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరు. అంతేకాదు ఇంకొంతమంది సోషల్ మీడియా ద్వారా ఏకంగా సెలబ్రిటీలుగా మారిపోతూ ఉండటం కూడా చూస్తూ ఉన్నామ్ అన్న విషయం తెలిసిందే. ఏకంగా తమకు నచ్చిన విధంగా రీల్స్ చేసి ఇంటర్నెట్లో ఫాలోవర్లను పెంచుకుంటున్నారు.

 అయితే ఎవరు చేయని రీతిలో సరికొత్తగా రీల్స్ చేస్తే ఫాలోవర్స్ సంఖ్య మరింత ఎక్కువగా పెంచుకోవచ్చు అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్న అందరికంటే భిన్నంగా వీడియోలు చేసి దానిని అప్లోడ్ చేయడం చేస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు ప్రమాదం అంచున కూడా ఇలాంటి రీల్స్ చేసి చివరికి ఎన్నో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యువతి రీల్స్ పిచ్చిలో మునిగిపోయి చివరికి ప్రమాదం బారిన పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 ముంబై కి చెందిన అన్వి కామ్ దార్ లోయలో పడి మృతి చెందింది. అలాగే ఓ జంట ఎత్తైన ప్రాంతంలో వేలాడుతూ నేటిజన్స్ ఆగ్రహానికి గురైంది. ఇక ఇప్పుడు మరో యువతి ఇలాగే రీల్స్ చేసి తనను తాను ప్రమాదంలో పడేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చంబాలో ఓ యువతి ఎత్తైన కొండపై నిలుచుకొని రీల్స్ చేస్తుంది. అయితే రీల్స్ చేసే తన్మయత్వంలో కాస్తంత దూరంలో వీడియోని రికార్డ్ చేస్తుంది. ఈ క్రమంలోనే కొండపై మహిళా పాట పాడుకుంటూ డాన్స్ చేస్తూ పరిగెత్తుకుంటూ వస్తుంది. అంతలో ఒక సరిగ్గా కాలు స్లిప్ అయ్యి కొండ మీద నుంచి దొర్లుకుంటూ కిందికి వెళ్లిపోయింది  ఈ ఘటనలో ఆమెకి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. కానీ తృటిలో ప్రాణాలతో బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: