ఆరోజు నుంచే ఏపీలో స్కూళ్లకు ఒంటిపూట బడులు..!!
మార్చి 18 నుంచి ఏపీలో పదవ తరగతి మెయిన్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయని ఈ పరీక్షలు జరుగుతున్న స్కూళ్లలో మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మరొకవైపు వంటి పూట బడులు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో విద్యార్థి తల్లిదండ్రులు కూడా కాస్త అసహనాన్ని తెలియజేయడంతో పాటు పిల్లల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒంటిపూట బడులను త్వరగా ప్రారంభించాలని పలు విద్యార్థి సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి పలు రకాల పత్రాలను సమర్పించారు. మరి ఈ విషయం ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియలేదు.
మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటి పూట బడులు నిర్వహించారు.. ఉదయం 7: 45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నారు.. ఇక ఏప్రిల్ 24వ తేదీ చివరి పని దినమని ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు.. ఏపీలో మాత్రం ఇంకా ఒంటి పూట బడిల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయాన్ని తీసుకోలేదు..ఈ ఏడాది మార్చి 15 కంటే ముందుగానే ఒంటి పూట బడులను మొదలు పెట్టాలని డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని ఇంకా తెలపలేదు..