వైరల్: ప్రజలను భయపెడుతున్న మంకీ ఫీవర్.. వ్యాధి లక్షణాలు ఇవే..!!

Divya
గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ మళ్ళీ తీవ్ర ఉద్రిక్తత నెలకొంటోంది అనే వార్తలు వినిపిస్తూ ఉన్న తరుణంలో ప్రజలు మళ్ళీ భయభ్రాంతులకు గురవుతున్నారు.. ఇప్పుడు తాజాగా మళ్లీ కర్ణాటక రాష్ట్రంలో మంకీ ఫీవర్ కేసులు రోజు రోజుకి పెరుగుతూ ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉత్తర కన్నడలోనే గత 15 రోజులలో 31 ఫీవర్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య నిపుణులు నిన్నటి రోజున తెలియజేశారు.. ఈ వ్యాధి సోకిన వారిలో 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా మిగిలిన వారు ఇంటి వద్దనే వైద్యం తీసుకుంటున్నట్లు తెలిపారు.

అయితే వీరి యొక్క ఆరోగ్యం మాత్రం నిలకడగానే ఉందంటూ ఇప్పటివరకు ఎలాంటి మరణ కేసులు సీరియస్ కేసులు కూడా నమోదు కాలేదు అంటూ వైద్యులు వెల్లడించారు.. ఈ కేసులు సిద్దాపూర్ ప్రాంతంలోని ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు. అయితే అక్కడ ఫారెస్ట్ ప్రాంతం కావడం చేత మంకీ ఫీవర్ ఎక్కువగా ఉన్నట్లు తెలియజేశారు. జనవరి 16వ తేదీన ఈ కేసులు నమోదైనట్లుగా అధికారులు తెలియజేశారు. సాధారణంగా కోతుల పైన నివసించేటువంటి పేలు కుట్టడం వల్ల ఈ జ్వరం వ్యాపిస్తుందని వైద్యులు తెలుపుతున్నారు.

కోతులలో ఉండేటువంటి పేలు మనుషులను కుట్టడం వల్లే ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుందట. ఈ పేలు పశువులను కుట్టిన ఈ వ్యాధి బారిన పడతాయని వైద్యులు తెలుపుతున్నారు. అయితే అటవీ పరిసర ప్రాంతాలలో నివసించేవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందంటూ తెలుపుతున్నారు.. ఈ మంకీ ఫీవర్ బారిన పడితే.. మూడు నుంచి ఐదు రోజుల వరకు తీవ్రమైన జ్వరం శరీర నొప్పులు కళ్ళు ఎరబడడం గుజలుబు తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు. అయితే కొన్నిసార్లు ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చు అంటూ తెలిపారు. ప్రతి ఏడాది కూడా 500 కేసులు నమోదవుతున్నట్లుగా తెలిపారు. ఈ వైరస్ ఎల్లో ఫీవర్ డెంగ్యూ కి కూడా కారణమవుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: