సింహానికి కంటి ఆపరేషన్.. నెట్టింట వైరల్!

Purushottham Vinay
అడవికి రారాజు సింహం. అదిగో సింహం అనే మాట వినగానే మన గుండె దెబ్బకు గుభేల్ మంటుంది. సింహ గర్జన కిలోమీటర్ల దూరంలోనే వినిపిస్తూనే మనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని పరిగెడతాం.అయితే ఇక ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో సింహని సంబంధించిన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ సింహానికి కంటి చూపు సరిగా లేదనే విషయం వాళ్ళకి ఎలా తెలిసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ సింహానికి కేటరక్ట్ అంటే శుక్లాల ఆపరేషన్ ని చేస్తున్నారు. గత కొంతకాలంగా కూడా ఈ సింహం ప్రవర్తన తేడాగా ఉండటం జామ్వాల రేంజ్ ఏరియాలోని ట్రాకర్స్ దానిని గమనించారు. ఇక ఈ సింహం దగ్గగరలో ఉన్న జంతువులు సైతం పోల్చుకోలేకపోతుంది. కంటి చూపు పోవడం వలన ఆహారాన్ని కూడా అది సంపాదించుకోలేకపోతుంది.అయితే దీని ప్రవర్తనపై అనుమానం వచ్చిన సిబ్బంది ఇక ఆ సింహాన్ని పరీక్షించారు. దాని రెండు కళ్ళలోని శుక్లాలు ఉన్నట్లు గుర్తించారు ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్.ఈ ఘటనతో సింహాన్ని జునాగఢ్ లోని శక్కర్ బాగ్ జూకి వారు తరలించారు.


అక్కడ సింహాన్ని పరిశీలించిన వైద్యులు దానికి కంటిచూపు కనిపించడం లేదనే విషయాన్ని గుర్తించి జన్వడ్ కేర్ సెంటర్ కు వారు తరలించారు.ఇక అక్కడ నిపుణులు దానిని పరిశీలించి ఈ సింహానికి లెన్సులు కోసం మధురై లోని ఒక కంపెనీని కూడా సంప్రదించారు.ఇక మత్తు ఇచ్చి ఆ సింహం కంటి కొలతలను తీసుకొని ఆ కంపెనీకి అందజేసారు .ఇక శక్కర్ బాగ్ జూ అందించిన వివరాల ప్రకారం కంపెనీ సింహానికి లెన్సులను నెలలోపు తయారు చేసి ఇచ్చింది. పశు వైద్యులు జావీయా సింహానికి ఆపరేషన్ చేసి ఆ శుక్లాలను తొలగించారు. మొదట సింహానికి ఒక కంటి ఆపరేషన్ చేసి డానికి లెన్స్ లు అమర్చారు.ఆ సింహాన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచి దానిని పరిశీలించగా దాని ఒక కన్ను కంటి చూపు బాగా మెరుగు అయినట్లు గమనించారు.ఒక పదిహేను రోజుల తర్వాత రెండవ కన్ను కూడా ఆపరేషన్ చేయడం చేసి శంకర్ బాగ్ జూలో పర్యవేక్షణలో ఉంచినట్లు అక్కడ డాక్టర్ రియాజ్ కడివార్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: