అద్భుతం : గంగాజలంతో.. చితిపై నుంచి ఆసుపత్రికి..?
ఢిల్లీలోని టిక్రీ ఖర్ద్లో జరిగిన ఓ ఘటన అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసినది. 62 ఏండ్ల సతీష్ భరద్వాజ్ చనిపోయినట్టు 11 మంది డాక్టర్లు నిర్థారించారు. అద్భుతం ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ.. చితికి నిప్పు అంటించేముందు అతని నోటిలో గంగాజలం పోశారు. ఆ గంగాజలం పోసిన తరువాత చితిలో పేర్చారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా చితిలోంచి కళ్లు తెరిచాడు. కళ్లు తెరవడమే కాకుండా మాటలు కూడా మాట్లాడాడు. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే హుటాహుటిన చితి పై నుంచి అతనినీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు.
ఢిల్లీలో క్యాన్సర్తో బాధపడుతున్న ఓ వృద్ధుడు మరణించాడనే విషయం వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని చేసారు. తెల్లవారుజామున మూడు గంటల సమయానికి శ్మశానికి తీసుకెళ్లి.. చితికి నిప్పు అంటించడానికి ముందు నోట్లో గంగాజలం పోసారు. ఆ నీరు నోట్లో పడిన వెంటనే వృద్ధుడిలో కదలిక కనిపించింది. అకస్మాత్తుగా కళ్లు తెరిచి మాట్లాడాడు. తాను ఇక్కడ ఎందుకు ఉన్నాను అని ప్రశ్నించడంతో అక్కడున్న వారందరూ అవాక్కయ్యారు. వారు వెంటనే తేరుకొని అంబులెన్స్కు, పోలీసులకు సమాచారం చేరవేసారు. వెంటనే నరేలా రాజాహరిశ్చంద ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని.. బీపీ సాధారణంగా, గుండె మామూలుగానే కొట్టుకుంటుందని వైద్యులు వెల్లడించారు. మెరుగైన వైద్యం కోసం లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్కు తరలించారు. గంగాజలానికి అంత శక్తి ఉన్నదా అని అందరూ చర్చించుకోవడం గమనార్హం.