ఐటీ రైడ్ చేసిన నోట్ల కట్టలు.. నెట్టింట వైరల్..

Purushottham Vinay
ఇక మనమందరం కూడా అనేక టాలీవుడ్,బాలీవుడ్ ఇంకా హాలీవుడ్ సినిమాలలో సెల్ఫ్‌లు ఇంకా అలాగే బీరువా అల్మారాలలో పేర్చబడిన డబ్బు యొక్క దృశ్యాలను చూడటం జరిగింది. ఇక మన టాలీవుడ్ సినిమా అయినా జులాయి సినిమాలలో ఇలాంటి వందల కోట్ల రూపాయల దృశ్యాలు చూసాము.కానీ అనేక సినిమాలలో చూసే ఈ డబ్బు కట్టలన్నీ కూడా నిజమైనవి అసలు కావు. అవన్నీ కూడా 90 శాతం ఎక్కువగా నకిలీవి. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలో కనిపిస్తున్న బీరువా అల్మారాలలో నిండిన డబ్బులు నకిలీవి కావు. హైదరాబాద్‌లోని ఒక ప్రధాన ఔషద కంపెనీపై ఆదాయపు పన్ను (ఐటి) విభాగం దాడి నుండి ఈ చిత్రాలు బయటపడ్డాయి. ఇక ఐటీ ఈ దాడిలో రూ. 142.87 కోట్ల విలువైన వివరించలేని నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు, రూ .550 కోట్ల వరకు లెక్కలు చూపని డబ్బును కనుగొన్నట్లు ఐటీ శాఖ ప్రకటించడం జరిగింది.

ఇక నోట్ల కట్టలతో నింపిన ఈ అల్మారాలు యొక్క ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యి కనిపించడం జరిగింది. ఇంకా కొన్ని గంటల్లోనే అవి వైరల్‌గా మారింది. ఈ దృశ్యం సోషల్ మీడియాలోని వందలాది మంది నెటిజన్లను ఉర్రూతలూగిస్తుంది.ఇక ఈ దాడులకు సంబంధించిన అనేక పూర్తి వివరాలు ఇంకా ఆ ఫార్మా కంపెనీ యొక్క పూర్తి పేరును ఇంకా వివరాలను ఐటి శాఖ వెల్లడించనప్పటికీ, ఫార్మా గ్రూప్ మధ్యవర్తుల తయారీ ఇంకా అలాగే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలు (ఎపిఐలు) ఇంకా ఫార్ములేషన్‌లు అలాగే చాలా ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకోవడంలో పాల్గొంటుందని పేర్కొనడం జరిగింది. ఇక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరప్, గల్ఫ్ కంట్రీస్ అయిన దుబాయ్ ఇంకా ఆఫ్రికన్ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు పేర్కొనడం జరిగింది. ఇక అలాగే మీడియా నివేదికల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, కరోనా వైరస్ మహమ్మారి చికిత్సలో ఉపయోగించే కోవిఫోర్ పేరుతో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ యొక్క సాధారణ వెర్షన్‌ని తయారు చేసిన మొదటి కంపెనీ హెటెరో డ్రగ్స్ అని కంపెనీ పేర్కొనడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: