ఏం టైమింగ్ గురు.. సమయస్ఫూర్తికీ ఫిదా అవ్వాల్సిందే?

praveen
సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాల్సింది కేవలం మంచి చెడులు మాత్రమే కాదు సమాజంలో ఎలా మెలగాలి ప్రమాదం వచ్చినప్పుడు ఎలా స్పందించాలి అన్న విషయాలను కూడా నేర్పించాల్సి ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇవన్నీ నేర్పించినప్పుడే ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు పిల్లలు.. కానీ నేటి రోజుల్లో ఎంతో మంది తల్లిదండ్రులు మాత్రం పిల్లలను అతిగా గారాబం చేస్తూ ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నారు. చివరికి  పెరిగి పెద్దయ్యాక ఏ చిన్న కష్టం వచ్చినా దానికీ తట్టుకోలేక ఆత్మహత్య ఒకటే శరణ్యం అన్న విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు ఎంతో మంది యువత.

కానీ ఇక్కడొక ఏడవ తరగతి చదువుతున్న చిన్నారి చూపించిన సమయస్ఫూర్తి చూసి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా అతని సమయస్ఫూర్తి కారణంగా 60 మందికి పైగా ప్రాణాలను నిలబెట్టాడు ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి. ఏంటి ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి ఏంటి ప్రాణాలు నిలబెట్టడం ఏంటి అని అంటారా.. ఏకంగా బస్సు ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి ఆపాడు సదరు బాలుడు. అతని తల్లిదండ్రులు అతనికి సమయస్ఫూర్తితో ఎలా మెలగాలి అని నేర్పించిన తీరు మాత్రం అందరిని ఫిదా చేస్తుంది.

 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే మిచి గాన్ లో ఒక బస్సు 60 మందికి పైగా ప్రయాణికులతో ముందుకు వెళుతుంది. ఈ క్రమంలోనే డ్రైవర్ ఎండ వేడిమికి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయాడు. దీంతో స్టీరింగ్ పూర్తిగా వదిలేసాడు. ఇక బస్సు అలాగే వేగంగా దూసుకుపోతుంది  ఇలాంటి సమయంలో సకాలంలో స్పందించిన విద్యార్థి డ్రైవర్ సీట్ లోకి దూకి ఎమర్జెన్సీ స్టాపర్ సహాయంతో బస్సును ఆపేశాడు. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది  అంతేకదా ఎమర్జెన్సీ నెంబర్ కు డయల్ చేయాలంటు కేకలు కూడా వేశాడు. అతని సమయస్ఫూర్తికి అందరూ ఫీదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: