నట్టి నడిరోడ్డుపై ఓ యువకుడు చేసిన పని సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.ఇంతకీ ఏం జరిగిందంటే ఆ కదులుతున్న బస్సుకు ఎదురెళ్లి మరీ తలతో గుద్దాడు ఆ యువకుడి. దీంతో ఏకంగా కదులుతున్న ఆ బస్సు అద్దం దెబ్బకు బద్ధలయ్యింది. అయితే ఆ యువకుడికి మాత్రం అసలు ఎలాంటి హాని కూడా జరగకపోవడం విశేషం. ఆ యువకుడిని చూసి బస్సు డ్రైవర్ ముందుగానే అలర్ట్ అయ్యి స్లో చేయడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పింది.అందువల్ల చిన్న చిన్న గాయాలతో బయటపడటం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వైరల్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ యువకుడు అసలు అలా ఎందుకు చేశాడో తెలియాలంటే ఇది చదవండి.కేరళ రాష్ట్రంలోని మలప్పురం పెరింథాల్మన్నలోని జూబ్లీ జంక్షన్ వద్ద బుధవారం నాడు ఈ సంఘటన జరిగింది.
అయితే ఆ యువుకుడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు యువకుడి తల్లిదండ్రులను పిలిపించి, ఆ తరువాత కోజికోడ్లోని మెంటల్ హెల్త్ సెంటర్కు తరలించారు.కదులుతున్న బస్సును ఢీకొట్టిన తర్వాత ఆ యువకుడు బస్సులోని స్టీరింగ్పై కూర్చొని కాసేపు హడావుడి కూడా చేశాడట.ఇక అతడు అసలు అలా ఎందుకు బిహేవ్ చేశాడన్న దానికి సంబంధించి ఓ ఆడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తాను బ్రెజిల్ జట్టు ఫుట్బాల్ ప్లేయర్ని అని, బస్సుకున్న బ్లూ కలర్ చూసి అర్జెంటీనా టీం గుర్తుకు వచ్చిందని ఆ కోపంతోనే అతను ఆ బస్సును ఢీకొట్టానని గట్టిగా అరిచాడు. దీంతో యువకుడికి ఖచ్చితంగా మానసిక సమస్య ఉందని భావించి ప్రస్తుతం మానసిక వైద్య నిపుణులు అతనికి సరైన చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతుంది.