మద్యం షాప్ లో చోరీకి వెళ్లారు.. కానీ అక్కడే కూర్చొని తాగి.. చివరికి?

praveen
మద్యం ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు. మద్యం ఎక్కువగా తాగితే లివర్ పాడయ్యి చివరికి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఇలాంటి విషయాలు అందరికీ తెలిసిన.. ఎవ్వరు పెద్దగా ఈ విషయాలను పట్టించు కోవడం లేదు. మద్యం తాగితే కిక్ వస్తుందా లేదా అన్న విషయాన్ని పరిగణ లోకి తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమం లోనే నేటి రోజుల్లో మద్యానికి బానిసగా మారి పోతున్నాను మందు బాబులు రోజుకు పెరిగి పోతున్నారు అని చెప్పాలి.

 ఇటీవలి కాలంలో ఎంతో మంది మందుబాబులు మద్యం కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు అని చెప్పాలి. ఒక పెగ్గు కోసం కొన్ని కొన్ని సార్లు మందుబాబులు చేసే పనులు అన్ని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇటీవల తమిళనాడులో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. తిరువల్లూరు జిల్లాలో ముందు బాబులు ఏకంగా మద్యం షాప్ లో దొంగతనం చేయడానికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో గోడకు కన్నం పెట్టి లోపలికి దూరారు.

 కొంత మద్యం ఎత్తుకెళ్లి బయట బ్లాక్ లో అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని అనుకున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత అంత మద్యం కళ్లారా చూసేసరికి వారి మనసు పులకరించి పోయింది..ఈ క్రమంలోనే రెండు పెగ్గులు వేసిన తర్వాత మద్యం ఎత్తుకెళదాం లే అని అనుకున్నారు. దర్జాగా మద్యం షాప్ లో కూర్చుని తాగడం మొదలు పెట్టారు. ఇలాంటి సమయంలోనే పెట్రోలింగ్ కి  వచ్చిన పోలీసులు దీన్ని గమనించారు. అక్కడ షాప్ దగ్గరికి వెళ్లి టార్చిలైట్ వేసి లోపల జరుగుతున్న తంతు చూశారు. ఇక ఆ తర్వాత వాళ్లు చేసిన కన్నం నుంచి వారిని బయటకు లాగారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో  వైరల్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: