నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్..అక్కడ చికెన్ 150 రూపాయలే..

Satvika
ఆదివారం వచ్చింది అంటే చాలు నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్,చేపలు రొయ్యలు అంటూ ఏదొక దుకాణం ముందు నిలబడి ఉంటారు..ప్రతి వస్తువు ధరలు పెరగడం తో నాన్ వెజ్ ధరలు కూడా ఆకాసాన్ని అంటూతున్నాయి.ధరల పెరుగుదలతో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ నుంచి గ్యాస్ వరకు చాలా వాటి ధరలు పైకి చేరాయి.బియ్యం ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు చికెన్ ధరలు మరోసారి పైకి చేరుతున్నాయి. ఇప్పటికే చికెన్ రేటు ఎక్కువగా ఉంది. ఇప్పుడు మరింత పెరుగుతోంది. ఇంకా కోడి గుడ్డు రేటు కూడా కొండెక్కుతోంది. ఇప్పుడు కోడి గుడ్డు ధర రూ. 7కు చేరింది. కానీ, అక్కడ మాత్రం రూ. 155 రూపాయలకే కిలో చికెన్ అంటున్నారు వ్యాపారులు. దాంతో చికెన్‌ ప్రియులు బారులు తీరారు. కిలోమీటర్ల మేర క్యూకట్టి చికెన్‌ కొనుగోలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే…

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చికెన్‌ కోసం మాంసం ప్రియులు ఎగబడ్డారు. ఆ చికెన్‌ దుకాణం ముందు ఏర్పాటు చేసిన విచిత్ర బోర్డు సైతం మాంసం ప్రియులను ఆకట్టుకుంటోంది. ఆ బోర్డుపై 155 రూపాయలకే కిలో చికెన్ అని రాసి ఉంది. అంతేకాకుండా మాంసం ప్రియులను ఆకట్టుకునేందుకు రారమ్మని పిలుస్తూ మైకు ద్వారా ప్రచారం చేస్తున్నారు. అసలే ఆదివారం ఆపై భారీ ఆఫర్ ఇంకేముంది..మాంసం ప్రియులు ఎగబడ్డారు. చికెన్ కొనుగోలు చేసేందుకు క్యూ లైన్ లో నిలబడి కొనుగోలు చేస్తున్నారు..

తెలంగాణ వ్యాప్థంగా చికెన్ ధరలు చికెన్ రేట్ రూ.280 నుండి రూ.300 మార్కెట్లలో విక్రయిస్తుంటే ఇతను మాత్రం డిఫరెంట్ గా తక్కువ చేసి ఎందుకు అమ్ముతున్నాడు అనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. కానీ, కొందరు చెప్పుకుంటున్నది ఏంటంటే ప్రపంచంలో ఏ వ్యాపారం చూసినా కాంపిటీషన్ కావడంతో ఎలానైనా బిజినెస్ పెంచుకోవడం కోసం బిజినెస్ లాస్‌ అయినప్పటికీ ఇతను మాత్రం చికెన్ నూట యాభై రూపాయలకే చికెన్ విక్రయిస్తుంటే మాంసప్రియలు మాత్రం ఎగబడి చికెన్ కొనుగోలు చేస్తున్నారు. మరీ చికెన్ సెంటర్ యజమాని ఎలా గిట్టుబాటు అవుతుందో తెలియదు కానీ అందరి దగ్గర నుంచి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: