ఆ జిల్లాలో సెలవు దినం ప్రకటించిన కలెక్టర్..!!
అయినప్పటికీ కూడా బ్యాంకులు మాత్రం తెరిచి ఉంటాయని తెలియజేశారు జిల్లా కలెక్టర్.. అయితే రేపటి రోజున సెలవు దినంగా ప్రకటించి మార్చి 12వ తేదీ రోజున వర్కింగ్ డే ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది.. ఇక సమ్మక్క సారక్క జాతర లు కన్నుల పండువగా సాగుతున్నా ఈ నేపథ్యంలోనే అందరికీ సెలవు దినంగా ప్రకటించడం తో కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇక్కడి జనాలని చూస్తే ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయి ఉంటుంది. ముఖ్యంగా చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న అమ్మవారిని గిరిజన సంప్రదాయంలో పూజలు చేసి అనంతరం వారిని తీసుకు రావడం జరిగిందట.
ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజున వెన్నెలలో సమ్మక్క ఆదివాసీ గిరిజన సాంప్రదాయ ప్రకారం పూజలు నిర్వహించి.. మేళతాళాలతో వారిని గద్దల పైకి తరలించడం జరిగిందట. ఇప్పటివరకు ఈ జాతరకు 70 లక్షల మందికి పైగా భక్తులు వచ్చారని.. మరో మూడు రోజుల్లో 60 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.. సమ్మక్క తల్లి భక్తులు వనదేవత ను దర్శించడం కోసం మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నేపథ్యంలో అధికారులు వారికి తగ్గట్టుగా ఏర్పాట్లను చేయడంలో నిమగ్నులయ్యారు.