ఆ తల్లి పరిస్థితి పగోడీకి కూడా రాకూడదు.. అయ్యో పాపం..
ఆ బిడ్డ జీవితాంతం తనతోనే ఉండాలని కోరుకుంది. కానీ అది అసాధ్యం. ఈ క్రమంలోనే ఆమెకు ఓ ఆలోచన తట్టింది. మొక్కలను పెంచే పూలకుండీలో ఆ పసిగుడ్డు మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. కన్నీరు పెట్టించే ఈ ఘటన అమెరికాలోని సిస్సోరీలో వెలుగు చూసింది. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ గుండె సంబంధిత సమస్యతో అకస్మాత్తుగా చనిపోయింది. దీంతో అబార్షన్ ద్వారా పిండాన్ని తొలగించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో పిండం రక్తపు ముద్దగా మారుతుంది. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో సర్జరీ ద్వారా ఆ బుజ్జి పిండాన్ని వైద్యులు బయటకు తీశారు.
ఆశ్చర్య పరిచే విషయం ఏంటంటే.. 14 వారాలకే ఆ పిండానికి అవయవాలు అన్నీ ఏర్పడ్డాయి. అక్కడ పడేయడానికి ఇష్టపడని మహిళ మృతపిండాన్ని సిలైన్ సీసా లో పెట్టి ఫ్రిజ్లో పెట్టింది. అతికష్టం మీద వారం రోజుల పాటు ఆ పిండాన్ని ఫ్రిజ్లో ఉంచిన శర్రాన్.. చివరికి మనసు చంపుకొని పూడ్చి పెట్టింది. ఆ పసి పిండానికి గుర్తుగా పూల కుండీ లో పూడ్చి పెట్టింది. తన బిడ్డను మొక్క రూపం లో చూసుకుంటూ మురిసిపోతుంది.. నిజంగా ఇలాంటి ఘటన పగోడికి కూడా రాకుకూడదు..