ఫస్ట్ ట్యాబ్ ను లాంచ్ చేసిన వన్ ప్లస్?

ఫేమస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన ఫస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను లాంచ్ చేసింది. 144hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే 11 అంగుళాల డిస్‌ప్లేతో వస్తున్న ఈ ట్యాబ్‌లో వెనుకవైపు ఒకే కెమెరాను ఫిక్స్ చేసింది వన్‌ప్లస్ కంపెనీ.అది కూడా సరిగ్గా మధ్యలో ఆ కెమెరా ఉండడం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక వన్‌ప్లస్ తెలిపిన వివరాల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ఈ ప్యాడ్‌ను ఎక్కువ సేపు వాడినా కూడా దానిని పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా యూజర్లు ఈ ప్యాడ్‌లో సౌకర్యవంతంగా చాలా ఈజీగా పని చేయగలుగుతారు. ఇండియన్ మార్కెట్‌లోకి తాజాగా లాంచ్ అయిన ఈ వన్‌ప్లస్ ప్యాడ్ బ్యాటరీ  కెపాసిటీ ఏకంగా 9,510 mAh ఉంటుంది. ఇక 67W సూపర్ వూక్ చార్జింగ్‌కు కూడా ఇది చాలా బాగా సపోర్ట్‌ చేస్తుంది. అంటే కేవలం 60 నిమిషాల్లోనే ఒకటి నుంచి 90 శాతం దాకా ఛార్జ్ చేయవచ్చన్న మాట.


ఇక మీడియాటెక్ డైమెన్సిటీ 9000 SoC ప్రాసెసర్ అలాగే 12 జీబీ ర్యామ్‌లనువన్‌ప్లస్ ప్యాడ్‌లో అందించింది వన్‌ప్లస్ కంపెనీ. అలాగే ఇందులో 144 Hz రిఫ్రెష్ రేట్, 7: 5 యాస్పెక్ట్ రేషియో ఇంకా 2800 x 2000 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడిన 11.61-ఇంచెస్ స్క్రీన్‌ కూడా ఉంది.ఇక అంతేకాక వన్‌ప్లస్ ప్యాడ్ ఫైల్ షేరింగ్, మల్టీ టాస్కింగ్ కోసం స్మార్ట్ సాఫ్ట్‌వేర్‌తో ఈ ట్యాబ్ వస్తుంది. వన్‌ప్లస్ ప్యాడ్‌లోని ఆడియో సిస్టమ్ కోసం డాల్బీతో వన్‌ప్లస్ పార్టనర్ షిప్ కుదుర్చుకుంది. ఇందులో మీరు సూపర్ సౌండ్‌ను అందించే నాలుగు స్పీకర్లను కూడా పొందుతారు. ఇక సింగిల్ హాలో గ్రీన్ కలర్‌లో లాంచ్ అయిన వన్‌ప్లస్ ప్యాడ్ ధరను అయితే వన్ ప్లస్ కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే ఇంటర్నెట్‌లో అందించిన సమాచారం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ఇది రూ.24,999లకు అందుబాటులో ఉండనుంది. మీరు పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌పై చూడవలసి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: