బుల్లి పిట్ట: అదిరిపోయే ఫీచర్లతో ఒప్పో సరికొత్త మొబైల్..!!

Divya
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ లేనిదే ఎవరూ కూడా ఏ పని చేయలేక పోతున్నారు. ముఖ్యంగా మనం ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్న ఎక్కడికి వెళ్లాలన్న కచ్చితంగా మన దగ్గర మొబైల్ ఉండాల్సిందే. అంతగా మనం మొబైల్ కు బానిసలు అయిపోయాము. ముఖ్యంగా మొబైల్స్ ఉండడం వల్ల ఇంట్లోనే కూర్చుని అన్నిటిని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తూ ఉన్నాము. అందుకోసమే మార్కెట్లో ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతూ ఉన్నాయి. సామాన్యులకు కూడా అందుబాటులో విధంగా ఉండే స్మార్ట్ ఫోన్లు తీసుకు వస్తున్నాయి టెక్ దిగ్గజ సంస్థలు. అయితే ఇప్పుడు తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్ధ ఒప్పో తాజాగా ఇండియన్ మార్కెట్లోకి ఒక కొత్త మొబైల్ ని విడుదల చేసింది వాటి గురించి చూద్దాం.
OPPO A-77 మొబైల్ మార్కెట్లోకి 4జి ఫోన్ బడ్జెట్ ధరల ఈ మొబైల్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవల కాలంలో మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ఒప్పో సంస్థ తాజాగా ఇలాంటి మొబైల్ ని ఇండియాలో తీసుకోవచ్చినట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.56 అంగుళాల హెచ్డి డిస్ప్లే తోపాటు ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది. ఇక ఈ మొబైల్ 128 GB స్టోరేజ్ మెమొరీ తో కలదు.

ఈ మొబైల్ సూపర్ ఫాస్ట్ చార్జర్ తో కూడా పని చేసే సామర్థ్యం కలదు. ఈ మొబైల్ బ్యాటరీ 5000MAH సామర్థ్యం కలదు ఈ మొబైల్ కేవలం ఐదు నిమిషాలు చార్జింగ్ చేస్తే చాలు మూడు గంటల పాటు అపరిమితంగా మాట్లాడుకోవచ్చు. ఈ మొబైల్ ధర రూ.17,999 రూపాయలు పలు బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లయితే 10త్ శాతం క్యాష్ బ్యాక్ ముందే అవకాశం ఉంది. కెమెరా విషయానికి వస్తే 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా.. సెల్ఫీ ప్రియుల కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: