బుల్లిపిట్ట: వన్ ప్లస్ బ్రాండ్ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..!!

Divya
ప్రముఖ దిగ్గజ సంస్థల్లో ఒకటైన వన్ ప్లస్ మొబైల్ తాజాగా అతి తక్కువ ధరలకే మొబైల్స్ ను విడుదల చేస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరు గ్రాండ్ మొబైల్ కావాలి అంటే కచ్చితంగా రూ. 50 వేల రూపాయలు పెడితే  తిసుకోవచ్చు అని ఆలోచనలో ఉండేవారు.. కానీ ఇటీవల వన్ ప్లస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ రావడంతో రూ.20 వేల నుంచి రూ.30 వేల మధ్య మీడియం రేంజ్  మొబైల్స్ ను తీసుకు వస్తున్నారు యూజర్స్ కు.
ఈ క్రమంలోనే తాజాగా వన్ ప్లస్ -2 స్మార్ట్ ఫోన్ కి అప్గ్రేడ్ వేరియేషన్ ని జత చేస్తూ నార్డ్-2T మొబైల్ ని విడుదల చేశారు. ఈ నెల చివరిలో కల్లా ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే యూరప్ వంటి దేశాలలో ఈ మొబైల్ లాంచ్ చేశారు. అయితే ఈ మొబైల్ యొక్క ఫీచర్లు ఒకసారి చూద్దాం. ఈ స్మార్ట్ మొబైల్ 90 H2 స్క్రీన్ రీప్లేస్ రేటు తో కూడినది. ఇక ఈ మొబైల్ 6.34 ఇంచుల ఫుల్ హెచ్ డి + ప్రసార్ తో పని చేస్తుంది.

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 డిస్ప్లే ప్రొటెక్షన్ ఈ మొబైల్ కు ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పవచ్చు. ఈ స్మార్ట్ మొబైల్ 1300 ప్రాసెస్ తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ ఆధారితంగా ఈ మొబైల్ పని చేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా తోపాటు సెల్ఫీ ప్రియుల కోసం 32 మెగాపిక్సల్ కెమెరా ని అందించనుంది. ఈ మొబైల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో 8 జి బి రామ్ +128  జీబీ స్టోరేజ్ మెమొరీ కలదు..12 GB రామ్ తో పాటు 256 స్టోరేజ్ మెమొరీ తో మరొక మొబైల్  కలదు. ఈ మొబైల్ ధర 399 యూరప్  కలదు దీనిని మన కరెన్సీలో చెప్పాలి అనుకుంటే 30,030 ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: