బుల్లి పిట్ట: శాంసంగ్ బ్రాండ్ నుంచి 5-G మొబైల్.. ధర తక్కువే..!!

Divya
ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఎన్నో ప్రముఖ బ్రాండెడ్ కలిగిన సంస్థలు ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా శాంసంగ్ వంటి బ్రాండెడ్ కలిగిన మొబైల్స్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటు ధరకే లభిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ ప్రముఖ బ్రాండెడ్ సంస్థ నుంచి అతి తక్కువ ధరకే 5-G మొబైల్ రెండు రోజుల క్రితం మార్కెట్లోకి విడుదల చేసింది. అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ-f 23 మొబైల్ ఫ్యూచర్ లో కూడా చాలా అద్భుతంగా ఉన్నట్లు ఆ సంస్థ తెలియజేసింది. ఇక ఈ మొబైల్ బ్యాక్ కెమెరా విషయానికి వస్తే 50 మెగాఫిక్సల్ కలదు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 8 మెగా ఫిక్సల్ కలదు. బ్యాటరీ విషయానికి వస్తే..5000 MAH సామర్థ్యం కలదు. ఇక అంతే కాకుండా ఫుల్ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఈ మొబైల్ కి ఛార్జింగ్ ఎక్కే సదుపాయం కూడా కలదు. ఈ మొబైల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో ముఖ్యంగా 4 GB ram,128 GB స్టోరేజ్ మెమొరీ తో కలదు.. మరొకటి 6GB ram ,128 GB మెమొరీ తో మరొకటి కలదు. ఇందులో ఆక్వా బ్లూ, గ్రీన్ కలర్ లో ఈ మొబైల్ లభిస్తుంది.

ఇక ఈ మొబైల్ ఆండ్రాయిడ్-12 ఆధారితంగా పనిచేస్తుంది. ఇక అంతే కాకుండా ఈ మొబైల్ కు రెండు సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్ అప్డేట్ లు నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అభ్యర్థులను కూడా ఇస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఇక ధర విషయానికి వస్తే 4 జిబి ర్యామ్ మొబైల్ ధర రూ.15,999 రూపాయలు కాగా. 6 -GB ram మొబైల్ ధర రూ.17,499 రూపాయలుగా ఉన్నది. ఈ మొబైల్ కంపెనీ అధికారిక వెబ్ సైట్ తో పాటు.. ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే తీసుకోవాలట. ఇక ఈ మొబైల్ పై ICICI బ్యాంక్ కార్లతో వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: