మర్సు కాలనీవాసులు తిరుగుబాటు చేస్తారా..!

MOHAN BABU
రక్తం, చెమట, కన్నీళ్ళతో కాంక్రీట్ తయారుచేయడానికి వీలవుతుంది. దీంతో అంగారకుడిపై కాలనీలు సాధ్యమేనని  తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వినడానికి గమ్మత్తుగా ఉన్న ఇదంతా నిజం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు మార్స్ గ్రహం పై మానవాళిని తరలించేందుకు ఏదోరకంగా భాగం పంచుకుంటున్నాయి. నాసా నేతృత్వంలో రాబోయే దశాబ్దకాలంలో  ఇది సాధ్యమేనని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పేస్ ఎక్స్‌ అధినేత ఎలాన్ మస్క్ ఈ విషయంలో అందరి కన్నా ముందు ఉన్నారు. ఆయన తన యావదాస్తిని వెచ్చించయినా సరే మనుషులను అంగారకుడిపైకి చేర్చేందుకు 24 గంటల కృషి చేస్తున్నారు.

అక్కడి వాతావరణం, రేడియేషన్ మనుషులను నిలువనీయ్యదనే భావన పరిశోధకులను వెనకడుగు వేసేలా చేసినా రోజురోజుకు వాటన్నింటినీ అధిగమించి పరిష్కారాలను కనిపెడుతున్నారు. మరోవైపు అక్కడ జీవించే పోయే ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారన్న విషయంపై భూమిపై మార్స్ గ్రహం లాంటి పరిస్థితులు కల్పించి జీవించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతటి కష్టమైనా సమయంలోనూ వారు తమ హద్దులు దాటి బయటకు రాకుండా సదరు సిమ్యులేటర్లు నిర్వహిస్తున్నారు. ఆ ప్రయోగాల్లో పాల్గొంటున్న ఔత్సాహికుల అనుభవాల నుంచి అంగారకుడిపై జీవించ పోయె మార్స్ గ్రహ వాసుల జీవితం సులభతరం కానుంది. అందులో భాగంగానే మాంచెస్టర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం ఒక కొత్త పరిశోధన పరిచయం చేసింది.


రక్తం,చెమట, కన్నీళ్లతో పాటుగ్రహాంతర ధూళితో కాంక్రీట్ లాంటి పదార్థాన్ని సృష్టించే మార్గాన్ని అభివృద్ధి చేసింది. దీంతో ఇప్పటివరకు అంగారకుడిపై కాలనీలు విషయంలో పెదవి విరిచిన వారిలో ఆశలు రేపుతున్నాయి. ఇటీవల జరుగుతున్న వరుస పరిశోధనలతో ఇది సాధ్యమనే అంచనాకు వస్తున్నాయి. అంగారక గ్రహంపై నాసా పంపించిన రోవర్లు ఎప్పటినుంచో పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో నాసా రోవర్ చాలా కీలకం కానుంది. తను బరువు ఉండే ఈ రోబో రోవర్ మార్స్పై దిగి ఇప్పటికీ అనేక సంచలన విషయాలు బయట పెట్టింది. నిజానికి ఈ ప్రాజెక్టు లో ఇదొక మైలురాయి. ఈ రోబోను వేలాది మంది సంవత్సరాల తరబడి శ్రమించి నిర్మించారు. మార్స్ పై జీవం ఆనవాళ్ల గురించి పరిశోధించేందుకు ద్వేజరో అనే సరస్సు ప్రాంతం దగ్గర ఈ రోవర్ ను దించారు.

ఇక్కడ ఉన్న రాళ్ళలో పురాతన జీవసంబంధ అంశాలను అన్వేషించే దిశలో  పని చేస్తుంది. అక్కడి రాళ్ళ లోని పొరను పరిశీలించడం ద్వారా గత జీవుల ఆనవాళ్లను పసిగట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఓ హెలికాప్టర్  పైన కూడా 15 సార్లు ప్రయోగం జరిపింది నాసా. మంచి ఫలితాలు సాధించింది. దాని పేరు ఇంజన్యూటీ, ఇది ఇప్పటివరకు గాలిలోకి ఎగిరింది ప్రతిసారి ఒక కొత్త విషయాన్ని డేటా రూపంలో భూమికి పంపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: