బుల్లిపిట్ట: నేటి నుంచి ఓలా బైక్స్ అమ్మకాలు.. అతి తక్కువ ధరకే..?

Divya
అతి తక్కువ ధరలో బైక్ కొనాలనుకునే వారికి ఇది ఒక శుభవార్త లాంటిది.. భారతీయ ఆటోమొబైల్ కంపెనీ నుండి వెలువడిన ఓలా పాపులారిటీ..అయితే ప్రస్తుతం మార్కెట్లో తన ఉనికిని చాటుకోవడానికి ఎలక్ట్రిక్ స్కూటర్ ల పై బాగా దృష్టి పెట్టింది ఇప్పుడు తమ బైకులను అందర్నీ నెమ్మది నెమ్మదిగా ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ప్రస్తుతం USA లో ఈ బైకులు 2022 నాటికి ప్రారంభమవుతున్నాయి. అందుకు సంబంధించి CEO భవిష్ అగర్వాల్ తెలియజేశారు. అన్ని సదుపాయాలు సక్రమంగా తమ కూర్చుకుంటే సంవత్సరానికి దాదాపుగా..10 మిలియన్ల యూనిట్లను అభివృద్ధి చేయగలమని భావిష్ అగర్వాల్  తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు.
కాలిఫోర్నియాలో కూడా త్వరలో  ఈ ఓలా బైక్ ని సరఫరా చేస్తామని తెలియజేశాడు. ఇక అంతే కాకుండా భారత దేశం లో వీటికి చాలా అద్భుతంగా స్పందన వస్తుందని తెలియజేశాడు.
OLA Electric బైక్స్ మాడల్ విషయానికొస్తే..
ఇందులో s1pro లను ఈనెల ఆగస్టు 15న భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. అందుకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాటి సబ్సిడీలను కూడా అందించనుంది. ఢిల్లీలో ఈ బైక్ ధర..85,099 రూపాయలుగా ఉంది. ఇది కేవలం బేసిక్ వేరియంట్ మోడల్ మాత్రమే.
ఇక ఓలా స్కూటర్ బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ బైకు ఒక్క ఛార్జర్ నుపయోగించి కేవలం 18 నిమిషాలలోనే 50 శాతం వరకు చార్జింగ్ లో చేసుకోవచ్చు. ఇక పూర్తి చార్జింగ్ చేసుకున్నచో.. దాదాపుగా 181 k.m వరకు లభిస్తుంది.
ఇక ఈ బైక్ ఫీచర్ విషయానికి వస్తే.. ఈ బైక్ 7 ఇంచుల టచ్ డిస్ప్లే కనెక్టివిటీ కలిగి ఉండును. రివర్స్ మోడ్, పూర్తి ఎల్ఈడి లైటింగ్, వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా మనం ముందర ఏదైనా పెట్టుకొని వెళ్లడానికి ఖాళీ స్థలం కూడా ఉన్నది. ఇక ఈ బైక్ దాదాపు 10 కలర్ లో మనకు లభిస్తుంది. ఈ బైక్ ను బుక్ చేసుకోవాలంటే కేవలం 499 రూపాయలతో బుక్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: