బుల్లి పిట్ట: షియోమీ.. రెండు సరికొత్త వేరియంట్ లతో భారత మార్కెట్లోకి విడుదల..

Divya
ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీతో కస్టమర్లకు అందుబాటులో ఉండే షియోమీ, ఇప్పుడు కూడా రెండు అదిరిపోయే మొబైల్ మోడల్స్ ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ రెండు మోడల్స్ ను కూడా సరికొత్త రంగులతో తీర్చిదిద్ది , మార్కెట్లోకి వదలడంతో ఇవి ఆకర్షణీయంగా కనిపించడం తో పాటు ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి అని అంటున్నారు. ఇక కొంతమంది కొనుగోలు చేసిన కస్టమర్లు, ఇటీవల షియోమీ తన ఉత్పత్తులలో భాగమైన రెడ్ మీ నోట్ 10 ప్రో తోపాటు రెడ్ మీ నోట్ టెన్ మ్యాక్స్ ను కూడా భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇక ఈ రెండు మోడల్స్ డార్క్ నెబ్యులా కలర్స్ వేరియంట్స్ తో అందుబాటులోకి వచ్చాయి.

ఇకపోతే ఈ మొబైల్స్ ధర ఎంత..? వీటి ఫీచర్స్ ఏంటి..? అని పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1. రెడ్ మీ నోట్ 10 ప్రో :
షియోమి ప్రవేశపెట్టిన రెడ్ మీ నోట్ 10 ప్రో మోడల్ స్మార్ట్ ఫోన్ లో సిక్స్ జీ బీ ర్యామ్ అలాగే 128 జీ బీ స్టోరేజ్ వేరియంట్ తో మనకు అందుబాటులో రానుంది. ఇక దీని ధర భారత్ మార్కెట్లో రూ.17,999 గా నిర్ణయించడం జరిగింది. ఒకవేళ 8 జీ బీ ర్యామ్ +128 జీ బీ స్టోరేజ్  కలిగిన స్మార్ట్ ఫోన్ ను  కొనుగోలు చేయాలి అనుకుంటే , దీని ధర రూ.18,999 గా ప్రకటించడం జరిగింది.
2. రెడ్ మీ నోట్ 10 ప్రో మాక్స్ :
ఇక ఇందులో 6 జీ బీ  + 128 జీబీ స్టోరేజ్ కలిగిన స్మార్ట్ ఫోన్ ను గనుక కొనుగోలు చేయాలి అనుకుంటే, దీని ధర రూ.19,999 గా నిర్ణయించడం జరిగింది. అదే 8 జీబీ + 128 జీ బీ స్టోరేజ్ కలిగిన మొబైల్ ధర రూ.21,999 గా భారత్ మార్కెట్లో నిర్ణయించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: