బుల్లిపిట్ట: రెండు సూపర్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసిన ఒప్పో..!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. ఇంకా ఇప్పుడు కూడా అలాంటి అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. అవి ఏంటి అనుకుంటున్నారా? అదేనండీ.. ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు ఒప్పో ఫైండ్ ఎక్స్2, ఫైండ్ ఎక్స్2 ప్రో స్మార్ట్ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేసింది. 5జీ సపోర్ట్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్లలో ఎన్నో అద్భుతమైన ఫీచర్లను, స్పెసిఫికేషన్లను అందచేశారు.
ఇంకా స్మార్ట్ ఫోన్ల ధరలు ఇలా ఉన్నాయి.
ఒప్పో ఫైండ్ ఎక్స్2.. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64,999గా నిర్ణయించారు.
ఈ స్మార్ట్ ఫోన్లు బ్లాక్(సిరామిక్), ఓషన్(గ్లాస్) రంగుల్లో లభించనున్నాయి.
అయితే ఒప్పో ఫైండ్ ఎక్స్2 ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్2 ప్రో ఆటోమొబైలీ లాంబోర్గినీ ఎడిషన్ ధరలను ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్లకు సంబంధించిన సెల్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
ఒప్పో ఫైండ్ ఎక్స్2 ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే..
6.7 అంగుళాల క్యూహెచ్ డీ+ అల్ట్రా విజన్ డిస్ ప్లే,
స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్,
వెనకవైపు మూడు కెమెరాలు అందించారు.
ప్రధాన కెమెరాగా 48 మెగా పిక్సెల్ + 48 మెగా పిక్సెల్ సెన్సార్ ను అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 13 మెగా పిక్సెల్ ను అందించారు.
సెల్ఫీ కెమెరా 32 మెగా పిక్సెల్,
4,260 ఎంఏహెచ్ బ్యాటరీ