ఆ కంటెస్టెంట్ కు రెడ్ కార్డ్ ఇచ్చిన నాగ్ మామ.. ఇది కథ అసలైన వేట..!

lakhmi saranya
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్బాస్ లో చాలా మంది పాటిస్పేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ లో నాగార్జున యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఇందులో ఎవరు విజయ్తగా నిలుస్తారో చూడాలి. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 8 సెప్టెంబర్ 1 న మొదలై మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా ...
మొదటి వారంలో బేఒక్క ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. ఇంకా రెండో వారంలో శేఖర్ భాషా వచ్చేశాడు. అయితే ఈ షోలో పలు వెరైటి టాస్కూల తో ఈ సీజన్ ను బిగ్ బాస్ మరింత రసవంతంగా మారుస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే ప్రేక్షకులు టీవీల దగ్గర నుంచి కదలటం లేదు. వారం మొత్తం చేసిన తప్పోప్పులను ప్రస్తావించి నాగార్జున సీరియస్ అవుతారు. వీకెండ్ ఎపిసోడ్స్ కచ్చితంగా చూస్తారు. ఎవరు మిస్ అవ్వకుండా చూస్తారు. ఇదిలా ఉంటే... తాజాగా , ఈరోజు ప్రోమో విడుదలై అందరిని షాక్ కు గురు చేస్తోంది.
 ఇందులో వచ్చి రాగానే నాగార్జున అభయ్ పై ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు వెళ్ళిపోమని డోర్స్ ఓపెన్ చేయించారు. దీంతో హౌస్ మెట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా అయోమయంలో పడిపోయారు. నాగ్ అలా అనటంతో యష్మి బతిమిలాడుతుంది. అప్పుడే ప్రోమో అయిపోయింది. ఇక ఇది చూసిన నెటిజన్లు అభయ్ ఉంటాడా లేక ఎలిమినేట్ చేసి ఇంటికి పంపిస్తారా? అని సాయంత్రం ఎపిసోడ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎలిమినేట్ అవుతాడా లేదో తెలియక సతమతం అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: