టీవీ: వారిని మరొకసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో గెలుకుతున్న అనసూయ..!!
ఇటీవలే అనసూయ బుల్లితెరకు దూరం అయ్యి వెండితెర పైన పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. పలు వివాదాల వల్ల అనసూయ పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇప్పుడు తాజాగా మరొకసారి ట్రోలర్ని కావాలని గెలికినట్టుగా తెలుస్తోంది.ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగేటువంటి ప్రశ్నలకు సైతం ఆన్సర్లను ఇస్తూ ఉంటుంది.
మీ గురించి ట్రోల్స్ చేసే వారిపట్ల మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్న అనసూయ కి సైతం ఎదురుగా..? అందుకు అనసూయ సమాధానాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో తనని ట్రోల్ చేసే వారిని ఏకంగా చీడపురుగులతో పోల్చింది.. ట్రోలర్స్ కూడా అలాంటి వారే అంటూ తెలియజేయడంతో పెను దుమారం రేపులా చేసింది అనసూయ.. అంతేకాకుండా ఆ కంపు మనకి అంటకూడదు కదా అందుకే అలాంటి వారి గురించి నేను మాట్లాడడం టైం వేస్ట్ అంటూ కూడా ట్రోలర్ల పైన తన అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది అనసూయ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనసూయ చేసిన కామెంట్లు సైతం సంచలనంగా మారుతున్నాయి.. అనసూయ ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు..