టీవీ: ఆహా వల్ల జబర్దస్త్ పైన ప్రభావం పడనుందా..?
త్వరలోనే ఈ కామెడీ షో ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ షో కి "కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ "అనే టైటిల్ తో సుడిగాలి సుదీర్ ని ముందు ఉంచి ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఆహా సంస్థ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఇందులో ముక్కు అవినాష్, యాదమ్మ రాజు, హరి తదితరులు జబర్దస్త్ మరియు పటాస్ కమెడియన్లు కూడా ఈ కార్యక్రమంలో కనిపించబోతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి ఒక కామెడీ షో వీడియోను కూడా ప్రేక్షకుల ముందుకు విడుదల చేయడం జరిగింది.
దీంతో ఈ కామెడీ షో పెద్ద ఎత్తున ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమం కచ్చితంగా సక్సెస్ అయ్యిందంటే ఇక ఆహా జబర్దస్త్ ను మించి ఉంటుందని ప్రేక్షకులు సైతం భావిస్తూ ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఆహా జబర్దస్త్ నుంచి కామెడీ కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రచారం జరుగుతూ ఉన్నది. అయితే ఈ కార్యక్రమానికి నాగబాబు జడ్జిగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. మరి దీని వల్ల రాబోయే రోజుల్లో జబర్దస్త్ పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుందా అనే విషయం మాత్రం అ షో పైనా ఆధారపడి ఉంటుంది.