టీవీ: ఆహా వల్ల జబర్దస్త్ పైన ప్రభావం పడనుందా..?

Divya
ఈటీవీ జబర్దస్త్ పోటీగా ఎన్నో కార్యక్రమాలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా స్టార్ మా, జీ తెలుగు కామెడీ షోలు తీసుకువచ్చి సక్సెస్ కాలేకపోయాయి. ఇప్పటివరకు జబర్దస్త్ స్థాయిని టచ్ చేసే అంత షో ఇతర చానల్స్ లో రాలేదని చెప్పవచ్చు. దీంతో కొన్ని చానల్స్ పలు షో లను కూడా ముసివేయడం జరిగింది. కానీ ఈటీవీలో మాత్రం జబర్దస్త్ కామెడీ షో ప్రసారమవుతూనే ఉన్నది. మరే ఇతర చానల్స్ లో కూడా కామెడీ షోలు లేవని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలోనే అహ ఓటీటి ద్వారా ఒక కామెడీ షో ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు పలు సన్నహాలు చేస్తున్నట్లుగా సమాచారం.

త్వరలోనే ఈ కామెడీ షో ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ షో కి "కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ "అనే టైటిల్ తో సుడిగాలి సుదీర్ ని ముందు ఉంచి ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఆహా సంస్థ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఇందులో ముక్కు అవినాష్, యాదమ్మ రాజు, హరి తదితరులు జబర్దస్త్ మరియు పటాస్ కమెడియన్లు కూడా ఈ కార్యక్రమంలో కనిపించబోతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి ఒక కామెడీ షో వీడియోను కూడా ప్రేక్షకుల ముందుకు విడుదల చేయడం జరిగింది.

దీంతో ఈ కామెడీ షో పెద్ద ఎత్తున ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమం కచ్చితంగా సక్సెస్ అయ్యిందంటే ఇక ఆహా జబర్దస్త్ ను మించి ఉంటుందని ప్రేక్షకులు సైతం భావిస్తూ ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఆహా జబర్దస్త్ నుంచి కామెడీ కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రచారం జరుగుతూ ఉన్నది. అయితే ఈ కార్యక్రమానికి నాగబాబు జడ్జిగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. మరి దీని వల్ల రాబోయే రోజుల్లో జబర్దస్త్ పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుందా అనే విషయం మాత్రం అ షో పైనా  ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: